Weight lose : బరువు తగ్గాలంటే.. ఏదో ఒకటి చేయాల్సిందే.. ఏం చేయకుండా మాత్రం బరువు తగ్గడం అనేది జరిగే పని కాదు.. బరువు పెరగడానికి చాలా కారణాలు ఉంటాయి. అలాగే బరువు తగ్గాడనికి కూడా చాలా మార్గాలు ఉన్నాయి. వ్యాయామం, ప్రొటీన్ డ్రింక్, డైట్లు ఇవా చాలా చేస్తుంటారు.. కొంతమంది బరువు పెద్దగా ఉండకపోయినా.. పొట్ట మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. మన ఇంట్లో ఉండే పదార్థాలతో వెయిట్ లాస్ డ్రింక్ను తయారు చేసుకుని తాగడం వల్ల నెల రోజుల్లోనే దాదాపు మూడు నుంచి నాలుగు కిలోల బరువు తగ్గవచ్చు. ఈ పానీయాన్ని తీసుకోవడం వల్ల ఎంతటి బాణ పొట్టైనా వేగంగా కరిగిపోతుంది తెలుసా..? ఇప్పటికీ ఈ డ్రింక్ తాగి చాలామంది వాళ్ల పొట్టలను తగ్గించుకున్నారు...అలాగే నడుము, తొడలు, పిరుదుల వద్ద పేరుకుపోయిన కొవ్వు కూడా కరుగుతుంది.
ఈ పానీయం చాలా ప్రభావవంతంగా పని చేస్తుంది. ఎన్ని రకాల డైటింగ్ పద్దతులు పాటించినా కూడా బరువు తగ్గని వారు ఈ పానీయాన్ని తాగడం వల్ల చాలా త్వరగా బరువు తగ్గవచ్చు. ఈ పానీయాన్ని తయారు చేసుకోవడానికి మనకు పెద్దగా ఖర్చు కూడా అవ్వదు.. కేవలం మన ఇంట్లో ఉండే పదార్థాలతో ఈ పానీయాన్ని తయారు చేసుకుని తీసుకోవచ్చు.
ఈ పానీయాన్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక గిన్నెలో ఒకటిన్నర గ్లాస్ నీళ్లను పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక ఇందులో అర టీ స్పూన్ అవిసె గింజలను వేయాలి. అవిసె గింజల్లో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో, శరీరంలో జీవక్రియల రేటును పెంచడంలో అవిసె గింజలు మనకు ఎంతో ఉపయోగపడతాయి. అవిసె గింజలను వేసిన తరువాత ఇందులో ఒక టీ స్పూన్ మోతాదులో ధనియాలను వేయాలి. ధనియాలు కడుపు ఉబ్బరం,
అజీర్తి, గ్యాస్ వంటి సమస్యలను తగ్గించడంలో శరీరంలో అధనంగా ఉన్న నీటిని అలాగే కొవ్వును కరిగిస్తాయి.. ఈ నీటిలో కచ్చా పచ్చగా దంచిన రెండు యాలకులను వేయాలి. మానసిక ఒత్తిడిని, ఆందోళనను తగ్గించడంలో అలాగే బరువును తగ్గించడంలో యాలకులు ఉపయోగపడతాయి. యాలకులను ఉపయోగించడం వల్ల శరీరంలోని వ్యర్థాలు తొలగిపోయి చిరుతిళ్లను తినాలన్న కోరిక కూడా తగ్గుతుంది. తరువాత ఈ నీటిలో ఒక నిమ్మకాయను గుండ్రటి ముక్కలుగా తరిగి వేయాలి. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో అధిక బరువును తగ్గించడంలో నిమ్మకాయ మనకు ఎంతో దోహదపడుతుంది. ఇప్పుడు ఈ నీటిని చిన్న మంటపై ఒక గ్లాస్ నీళ్లు అయ్యే వరకు బాగా మరిగించాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి ఈ నీటిని ఒక గ్లాస్ లోకి తీసుకుని గోరు వెచ్చగా అయ్యే వరకు ఉంచండి...తరువాత దీనిలో రుచి కొరకు టీ స్పూన్ తేనెను వేసి కలపాలి.
షుగర్ వ్యాధి గ్రస్తులు దీనిలో తేనెను ఉపయోగించకపోవడమే మంచిది. ఇలా తయారు చేసుకున్న నీటిని రోజూ రెండు పూటలా ఉదయం పరగడుపున అలాగే రాత్రి పడుకునే ముందు తీసుకోవాలి. ఇలా ఈ పానీయాన్ని తయారు చేసుకోవడానికి ఉపయోగించిన పదార్థాలను పడివేయకుండా రాత్రి పూట వీటితోనే మరలా పానీయాన్ని తయారు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న పానీయాన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కేవలం నెలరోజుల్లోనే మన శరీరంలో వచ్చిన మార్పును గమనించవచ్చు. అధిక బరువుతో బాధపడే వారు ఎటువంటి దుష్ప్రభావాలు లేకుండా చాలా సులభంగా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఇందులో వాడిన పదార్థాలు అన్నీ ఇంట్లో ఉండేవే కాబట్టి.. ఒకసారి ట్రై చేసి చూడండి..