మహిళలను వెంటాడుతున్న సమస్యలు..
Women health : ఇంట్లో పనులు చేసుకుంటూనే బయటిపనులు కూడా చక్కదిద్దుకుంటున్నారు. ప్రతి రంగంలోనూ తమదైనా ముద్రను వేస్తున్నారు మహిళలు. ఆఫీస్, ఇంటి పనుల్లో నిమగ్నమైపోవడంతో తమ ఆరోగ్యాల గురించి పట్టించుకోవడం మానేశారు.
ఆడవాళ్లు మీకు జోహార్లు అనే పదం ఎన్ని సార్లు చెప్పినా తక్కువే. ఎందుకంటే నేటి మహిళలు అన్నిరంగాల్లో దూసుకుపోతున్నారు. రాజకీయాలు, సైనిక వ్యవస్థలతో పాటు నింగిలోకి కూడా చొచ్చుకుపోతున్నారు. మగవారు చేసే ప్రతి పనిని ఆధునిక మహిళలు సునాయాసంగా చేసేస్తున్నారు.
ఇంట్లో పనులు చేసుకుంటూనే బయటిపనులు కూడా చక్కదిద్దుకుంటున్నారు. ప్రతి రంగంలోనూ తమదైనా ముద్రను వేస్తున్నారు మహిళలు. ఆఫీస్, ఇంటి పనుల్లో నిమగ్నమైపోవడంతో తమ ఆరోగ్యాల గురించి పట్టించుకోవడం మానేశారు. అందరికీ అన్నీ పనులు చేశాక తినడం.....మిగిలిపోయింది కదా అని కడుపులో వేసేసుకుంటారు. సరైన సమయానికి తినకపోవడంతో అనారోగ్య సమస్యలు కోరి తెచ్చుకుంటున్నారు. తమకంటూ సమయం ఇవ్వలేకపోతున్నారు. తినే ఆహారంపైనా శ్రద్ధ పెట్టడం లేదు. ఎంత తింటున్నారో కూడా పట్టించుకోవడం లేదు.
అయితే ఇలా అశ్రద్ధ చేయడం అస్సలు మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాస్త సమయమైనా శ్రద్ధ పెట్టాలని సూచిస్తున్నారు. సాధారణంగానే మహిళల శరీర తత్వం....పురుషుల కంటే భిన్నంగా ఉంటుంది. రకరకాల ఆలోచనలు, ఇంటి పనులు, అనారోగ్యాలు, హార్మోన్ల అసమతుల్యతతో సతమతమవుతుంటారు. నెలసరి, గర్భదారణ, మోపాజ్ వంటివి ఉండటం . స్త్రీలు మంచి ఆహారం తీసుకోకపోతే ఆ ప్రభావం నెలసరిపై కచ్చితంగా పడుతుంది. సంతాన సమస్యలపైనా ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
ముందు నుంచి మహిళలు ఎక్కువగా ఐరన్ లోపంతో బాధపడుతున్నారు. పీరియడ్స్ సమయంలో బ్లీడింగ్ రూపంలో రక్తం బయటకు వచ్చేస్తుంది. అంతేకాదు.....ప్రసవం సమయంలోనూ రక్తం పోతుంది. దానివల్ల ఐరన్ లోపం కచ్చితంగా వస్తుంది. రక్తం పోవడం వల్ల తల తిరగడం, అలసట, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది. ప్రస్తుత కాలంలో ఆహారపద్ధతుల్లో మార్పులు రావడం వల్ల మహిళల్లో ఎముకల క్షీణత పెరుగుతోంది. పురుషులైన, మహిళలైనా శరీరానికి అవసరమైనది కాల్షియం . మహిళల్లో విటమిన్ B9 లోపిస్తే రక్తహీనత వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అదే గర్భిణుల్లో ఉంటే పుట్టే పిల్లల నాడీ వ్యవస్థలో లోపాలు ఉండే అవకాశం తలెత్తే ప్రమాదం ఉంది. శరీరంలో అయోడిన్ స్థాయి తక్కువగా ఉంటే, థైరాయిడ్ గ్రంధి విస్తరించి, గాయిటర్ అనే సమస్య వస్తుంది. కొంతమంది బరువు పెరుగుతారు. దీంతో పాటు శరీరం బలహీనత, అలసట, జుట్టు రాలడం వంటి సమస్యలు వస్తాయి.
విటమిన్ డి లోపం వల్ల ఆయాసం, వెన్నునొప్పి, జుట్టు రాలడం, గాయాలు మానకపోవడం వంటి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. విటమిన్ డీ పొందాలంటే.. ఉదయాన్నే నీరెండలో ఓ అరగంట పాటు ఉంటే మంచిది
మహిళలు తినాల్సిన ఆహారం
ఐరన్ లోపం నుంచి బయటపడాలంటే మాంసం, చేపలు, ఆకుకూరలు, డ్రైఫ్రూట్స్, బీన్స్, పప్పుధాన్యాలు, సోయా, టొమాటో, బంగాళాదుంపలు, పుట్టగొడుగులు, ఖర్జూరం, బఠాణీలు, సీజనల్ పండ్లు వారి డైట్లో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మహిళలు కాల్షియం లోపం దూరం చేసుకోవడానికి .. పాలు, పెరుగు, చీజ్, ఆకుకూరలు, చేపలు, తృణధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి.