ధనియాలు, అవిసె గింజలతో ఇలా చేస్తే.. థైరాయిడ్‌ సమస్య తగ్గుతుంది..!

Thyroid  సమస్య.. సంతానం మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఇది పురుషుల్లో, స్త్రీలల్లో ఇద్దరికీ సమస్యే. మ‌నం తీసుకునే ఆహారం, మ‌న జీవ‌న విధాన‌మే ఈ స‌మ‌స్య రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు.

ధనియాలు, అవిసె గింజలతో ఇలా చేస్తే.. థైరాయిడ్‌ సమస్య తగ్గుతుంది..!
Thyroid problem


Thyroid  సమస్య.. సంతానం మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఇది పురుషుల్లో, స్త్రీలల్లో ఇద్దరికీ సమస్యే. మ‌నం తీసుకునే ఆహారం, మ‌న జీవ‌న విధాన‌మే ఈ స‌మ‌స్య రావ‌డానికి ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్ప‌వ‌చ్చు. అలాగే జ‌న్యుప‌రంగా కూడా ఈ స‌మ‌స్య త‌లెత్తుతుంది.

ఈ థైరాయిడ్‌లో కూడా హైపో థైరాయిడిజం, హైప‌ర్ థైరాయిడిజం అనే రెండు ర‌కాలు ఉన్నాయి. థైరాయిడ్ కార‌ణంగా నీర‌సం, శ‌రీరంలో శ‌క్తి త‌గ్గిన‌ట్టుగా అనిపించడం, ఆక‌లి త‌క్కువ‌గా ఉండ‌డం, మ‌ల‌బ‌ద్ద‌కం, చ‌లి ఎక్క‌వ‌గా అనిపించ‌డం, బ‌రువు పెర‌గ‌డం లేదా బ‌రువు త‌గ్గ‌డం, జుట్టు రాల‌డం, స్త్రీల‌లో నెల‌స‌రిలో మార్పు రావ‌డం వంటి అనేక స‌మ‌స్య‌లు త‌లెత్తుతాయి. థైరాయిడ్ బారిన ప‌డిన వారు మందులు వేసుకుంటే స‌రిపోతుంది... అనుకుంటే పొర‌పాటే. మందులను వాడ‌డంతో పాటు స‌రైన ఆహారాన్ని కూడా తీసుకోవ‌డం చాలా అవ‌స‌రం. 

ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని తీసుకుని వేడి చేయాలి. నీళ్లు వేడ‌య్యాక అందులో ఒక టీ స్పూన్ ధ‌నియాల‌ను వేసి 10 నిమిషాల పాటు బాగా మ‌రిగించాలి. ధ‌నియాల‌కు బ‌దులుగా ధ‌నియాల పొడిని లేదా కొత్తిమీర‌ను కూడా వేసుకోవ‌చ్చు. ధ‌నియాల్లో హార్మోన్ల అస‌మ‌తుల్య‌త‌ల‌ను తొల‌గించే గుణాలు పుష్క‌లంగా ఉంటాయి. థైరాయిడ్ గ్రంథి ప‌నితీరును మెరుగుప‌ర‌చ‌డంలో ధ‌నియాలు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి.

నీళ్లు బాగా మ‌రిగిన తరువాత ఈ నీటిని వ‌డ‌క‌ట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. త‌రువాత ఇందులో రుచికి కొర‌కు అర టీ స్పూన్ తేనెను వేసి క‌ల‌పాలి. ఇలా త‌యారు చేసుకున్న ధ‌నియాల క‌షాయ‌న్ని రోజూ ఉద‌యం ప‌ర‌గ‌డుపున తీసుకోవ‌డం వ‌ల్ల హైపో థైరాయిడిజం అదుపులో ఉంటుంది. ఈ క‌షాయాన్ని తాగ‌డం వ‌ల్ల సుల‌భంగా బ‌రువు కూడా త‌గ్గ‌వ‌చ్చు. 

థైరాయిడ్ వ్యాధిగ్ర‌స్తులు తీసుకోవాల్సిన ఆహారాల్లో అవిసె గింజ‌లు ఒక‌టి. థైరాయిడ్ గ్రంథి ప‌నితీరును మెరుగుప‌ర‌చ‌డంలో అవిసె గింజ‌లు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల.. అనేక ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. థైరాయిడ్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ముందుగా ఒక క‌ళాయిలో అవిసె గింజ‌ల‌ను వేసి రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి. త‌రువాత వీటిని జార్‌లో వేసి మెత్తని పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని గాజు సీసాలో వేసి నెల రోజుల పాటు నిల్వ కూడా ఉంచుకోవ‌చ్చు. ఇలా త‌యారు చేసుకున్న పొడిని ఒక టీ స్పూన్ మోతాదులో తీసుకుని ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో వేసి బాగా క‌లపాలి.

ఇలా త‌యారు చేసుకున్న నీటిని ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తీసుకోవాలి. ఇలా నీటిని తాగ‌లేని వారు ఒక టీ స్పూన్ మోతాదులో అవిసె గింజ‌ల పొడిని తిని ఆ త‌రువాత నీటిని తాగాలి. అలాగే అవిసె గింజ‌ల పొడిని ఆహారంలో భాగంగా చేసుకోవాలి. 

ఈ థైరాయిడ్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు క్యాలీప్ల‌వ‌ర్, క్యాబేజి, బ్ర‌కోలి, ముల్లంగి వంటి కూర‌గాయ‌ల‌ను త‌క్కువ‌గా తీసుకుంటే చాలా మంచిది. అలాగే పాల ప‌దార్థాల‌ను కూడా త‌క్కువ‌గా తీసుకోవాలి. ఆహారంలో బి విట‌మిన్స్, ఐర‌న్ ఎక్కువ‌గా ఉండేలా చూసుకోవాలి.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.