Back pain : నడుము నొప్పికి చక్కని పరిష్కారాలు
Back pain, వెన్ను నొప్పి అనేది పెద్దవాళ్లకే వస్తుంది అనుకోవడం పొరపాటే. మధ్యవయసు, టీనేజీలో కూడా ఇవి వస్తుంటాయి. ఎందుకంటే కాలం మారింది. కాలం కంటే వేగంగా మనుషులు కూడా పరుగులు పెడుతున్నారు.
Back pain : మంచి ఆహారం తింటున్నా...అయినా పీరియడ్స్ వచ్చాక చచ్చేంత నడుమునొప్పి...ఎందుకంటారు? మా కోడలు చిన్నమ్మయే...కానీ రోజంతా పని చేశాక వెన్నునొప్పితో విలవిలలాడుతోంది.....ఏమైంది? Back pain, వెన్ను నొప్పి అనేది పెద్దవాళ్లకే వస్తుంది అనుకోవడం పొరపాటే. మధ్యవయసు, టీనేజీలో కూడా ఇవి వస్తుంటాయి. ఎందుకంటే కాలం మారింది. కాలం కంటే వేగంగా మనుషులు కూడా పరుగులు పెడుతున్నారు. శరీరంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు వచ్చినా అసలు పట్టించుకోవడమే మానేశారు. అదేటంటే చిన్న నొప్పే కదా....తగ్గిపోతుందిలే అని నిర్లక్ష్యం చేసేస్తున్నారు. అది మాత్రం చాలా తప్పు. కాస్త అనారోగ్యంగా అనిపించినా......ఎందుకు వస్తుందో తెలుసుకోవాలి. ఏం చేస్తే తగ్గుతుందో ముందే గ్రహించాలి. అది తెలియక చాలా మంది ప్రాణాలమీదకు తెచ్చుకుంటారు.
ఎక్కువ సేపు కూర్చోవడం, అడ్డదిడ్డంగా కూర్చుంటారు. ఎక్కువ సేపు నిల్చుని పనులు చేయడం, పడుకునేటప్పుడు తలగడ బాగులేకపోయినా నడుము నొప్పి, వెన్నుపూసలో చిన్నపాటి మంటగా అనిపిస్తుంది.
రోజంతా డెస్క్ దగ్గర కూర్చోవడం వల్ల వెన్నుపూస వంగిపోతుంది. కాస్త నొప్పిగా అనిపించిన వెంటనే.....కూర్చున్న కూర్చిపై చిన్నచిన్న వ్యాయామాలు చేసుకోవాలి. నడుమును అటు ఇటూ తిప్పాలి. మెడను కూడా కాస్త తిప్పాలి. వెంటనే ఉపశమనంగా అనిపిస్తుంది.
ఒక్కోసారి పనులు చేసేటప్పుడు పెద్ద పెద్ద బరువులు ఎత్తేస్తుంటారు. అలా చేయడం వల్ల వెన్నులో గాలి ఉండిపోయి.....నొప్పి వచ్చేస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. చెట్లు కొట్టడం వల్ల కూడా వెన్నునొప్పి వస్తుంది. ఈ రోజుల్లో వెన్నునొప్పి సర్వసాధారణం అయిపోయింది. వయసుతో తేడా లేకుండా వస్తోంది. గంటల తరబడి టీవీలు, సెల్ ఫోన్లు చూడటం వల్ల వెన్నునొప్పి బాధిస్తుంది. మనం చేసే ప్రతి పని వల్ల....వెన్నుపై ఒత్తిడి కచ్చితంగా ఉంటుంది. దీనివల్ల విపరీతమైన నొప్పితో అవస్థ పడుతుంటాం.
పీరియడ్స్ వచ్చినప్పుడు రక్తస్రావం జరగడంతో ఒంట్లో నిస్సత్తువ ఆవహిస్తుంది. అలాంటి సమయాల్లో ఎక్కువ పనులు చేయకుండా కాస్త విశ్రాంతి తీసుకోవాలి. కానీ ఈ రోజుల్లో అది జరగడం లేదు. కానీ తప్పదు...విశ్రాంతి తీసుకోవాల్సిందే. లేకపోతే శరీరంలో రక్తం బయటకు వచ్చేయడం వల్ల వెన్నునొప్పి వెంటాడుతుంది.
వెన్నునొప్పి తగ్గాలంటే వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. ఆసనాలు వేయాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల వెన్నునొప్పి నుంచి ఉపశమనం లభించడమే కాకుండా శరీర భంగిమను మెరుగుపరుస్తుంది.
నడుము నొప్పి తగ్గాలంటే సుప్తమత్స్యేంద్రాసనం వేయాలి.
వెల్లకిలా పడుకుని చేతులు నేల మీద చాపి ఉంచాలి.
కుడి కాలును మడిచి, ఎడమ కాలి మీదుగా శరీరం పక్కకు వంచి, నేలను తాకించాలి. నేలను తాకిన కుడి కాలును ఎడమ చేత్తో పట్టుకోవాలి. నడుము కింది భాగం మాత్రమే కదలాలి. శరీరం మొత్తం కాలుతోపాటే కదపకూడదు. ఈ భంగిమలో అరగంటపాటు ఉండి రెండోవైపు సాధన చేయాలి. ఆసనం పూర్తయ్యాక రెండు కాళ్లు నేలకు ఆనించి పడుకుని, నెమ్మదిగా పైకి లేవాలి. కొత్తలో ఈ ఆసనం శిక్షకుల పర్యవేక్షణలో సాధన చేయాలి.