ఆకుకూరలు అన్నీ ఆరోగ్యానికి మేలు చేసేవి.. ఇవి రోజు తిన్నా ఎలాంటి నష్టం ఉండదు.. ఇంకా హెల్తీగా ఉంటారు. ఆకుకూరల్లో చాలామంది ఇష్టమైనది పాలకూర.. దీంతో పప్పు, కూర, వడలు ఇలా రకరకాలు చేసుకుని తింటారు. అయితే కొంతమంది పాలకూరను జ్యూస్లా చేసుకుని తింటారు. అయితే పాలకూరను పచ్చిగా తినవచ్చా.. తింటే ఏదైనా హాని జరుగుతుందా.. అని చాలా మంది సందేహిస్తుంటారు.

ఆగ్జలేట్స్ ఎక్కువగా కలిగిన ఆకుకూరలల్లో పాలకూర ఒకటి. పాలకూరలో 0.97 శాతం ఆగ్జాలిక్ ఆమ్లం ఉంటుంది. ఈ ఆగ్జాలిక్ ఆమ్లం మన శరీరంలో ప్రవేశించినప్పుడు కాల్షియంతో కలిసిపోయి మన శరీరం కాల్షియంను గ్రహించకుండా చేస్తుంది. దీని వలన kidney stones ఏర్పడడమే కాకుండా మూత్రాశయంలో కాల్షియం స్పటికాలు ఏర్పడతాయికిడ్నీలల్లో రాళ్లు ఏర్పడడమే కాకుండా మూత్రాశయంలో కాల్షియం స్పటికాలు ఏర్పడతాయి. ఈ కాల్షియం స్పటికాలు తొందరగా కరిగిపోవు. దాని వలన కిడ్నీలలో, మూత్రాశయంలో రాళ్లు ఏర్పడి మూత్రాశయ సంబంధిత వ్యాధులకు దారి తీస్తుంది.
పాలకూరను పచ్చిగా తినడం కంటే ఉడికించి తినడం చాలా మంచిది. పోషకాహార నిపుణులు చెబుతున్న ప్రకారం.. పాలకూరను ఉడికించడం వలన 80 నుంచి 90 శాతం ఆగ్జాలిక్ ఆమ్లాన్ని తగ్గించవచ్చు. దీని వలన మన శరీరంలోకి ప్రవేశించే ఆగ్జాలిక్ ఆమ్ల శాతం తగ్గుతుంది. ఫలితంగా కిడ్నీ స్టోన్లు ఏర్పడకుండా చూసుకోవచ్చు. పాలకూరను పచ్చిగా తినడం కంటే ఉడికించి తినడమే ఉత్తమం.
పాలకూర జ్యూస్ తాగొచ్చా..?
చాలమంది వివిధ అనారోగ్య సమస్యల వల్ల పాలకూరను జ్యూస్గా చేసుకుని తాగుతుంటారు. ఒక గ్లాస్లో సగం వరకు జ్యూస్ తీసుకుని మిగిలిన సగం నీళ్లను కలపాలి. అనంతరం అందులో కొద్దిగా నిమ్మరసం, తేనె కలపాలి. దీంతో ఆగ్జాలిక్ ఆమ్లం శాతం తగ్గుతుంది. ఇలా పాలకూరతో కిడ్నీ స్టోన్లు ఏర్పడకుండా సురక్షితంగా దాన్ని తీసుకోవచ్చు. ఈ విధంగా జ్యూస్ను తాగినా.. సమస్య ఉండదు. అలా కాకుండా..పాలకూరను కేవలం జ్యూస్ చేసి చిక్కగా ఉన్నది తాగడం వల్ల కిడ్నీలు సమస్యలు వస్తాయి. కచ్చితంగా అందులో వాటర్ కలపాలని మాత్రం గుర్తుపెట్టుకోండి.
పచ్చిపాలకూర తింటే కిడ్నీలో రాళ్లు ఏర్పడుతున్నాయా..?
ఆగ్జలేట్స్ ఎక్కువగా కలిగిన ఆకుకూరలల్లో పాలకూర ఒకటి. పాలకూరలో 0.97 శాతం ఆగ్జాలిక్ ఆమ్లం ఉంటుంది. ఈ ఆగ్జాలిక్ ఆమ్లం
కిడ్నీలల్లో రాళ్లు ఏర్పడడమే కాకుండా మూత్రాశయంలో
కాల్షియం స్పటికాలు ఏర్పడతాయి. ఈ కాల్షియం స్పటికాలు తొందరగా కరిగిపోవు. దాని వలనమన శరీరంలో ప్రవేశించినప్పుడు కాల్షియంతో కలిసిపోయి మన శరీరం కాల్షియంను గ్రహించకుండా చేస్తుంది. దీని వలన కిడ్నీలలో, మూత్రాశయంలో రాళ్లు ఏర్పడి మూత్రాశయ సంబంధిత వ్యాధులకు దారి తీస్తుంది. కాబట్టి పాలకూరను ఉడికించి మాత్రమే తినాలి. ఇక జ్యూస్ చేసుకుని తాగేవాళ్లు కచ్చితంగా అందులో వాటర్ కలపాలి.