మూత్రంలోని నురగ వస్తుందా.. చాలా ప్రమాదం సుమా!
సాధారణంగా మూత్రం పోసినప్పుడు నురగ రాదు. కొందరిలో మాత్రం ఇది కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ విషయం ఆ జాగ్రత్త చేయాల్సిన విషయం కాదని వెంటనే వైద్యుల్ని సంప్రదించాలని తెలుస్తోంది. కిడ్నీలకు సంబంధిం
సాధారణంగా మూత్రం పోసినప్పుడు నురగ రాదు. కొందరిలో మాత్రం ఇది కనిపిస్తూ ఉంటుంది. అయితే ఈ విషయం ఆ జాగ్రత్త చేయాల్సిన విషయం కాదని వెంటనే వైద్యుల్ని సంప్రదించాలని తెలుస్తోంది. కిడ్నీలకు సంబంధించిన ఏవైనా వ్యాధులు సైతం ఉన్నప్పుడు కూడా ఇలా నురగ వచ్చే అవకాశం ఉందని దీన్నే అజాగ్రత చేయవద్దని హెచ్చరిస్తున్నారు.
కిడ్నీలో శరీరంలో ఎంతో ముఖ్యమైన అవయవం నిత్యజీవితంలో ఇవి సక్రమంగా పనిచేసినప్పుడు మాత్రమే శరీరం నియంత్రణలో ఉంటుంది వీటి విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తిన పలు రకాల సమస్యలు దాడి చేస్తాయి అయితే మూత్రం పోసినప్పుడు నురగ కనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లోనే దాన్ని అజాగ్రత్త చేయకూడదని తెలుస్తోంది. ఈ విషయం ప్రతి ఒక్కరిలో కనిపించేది కాదు. శరీరంలో ఏదైనా తేడా జరిగినప్పుడు మాత్రమే కనిపిస్తుంది. ఇలా మూత్రంలో నురగరావడం దేనికి సంకేతం అంటే శరీరంలో ఉండే మాంస్కృతులు, ప్రోటీన్స్ బయటకు పోతున్నాయని తెలుస్తోంది. అలాగే ఆల్బమిన్, విలువైన ఎన్నో ఖనిజ పోషకాలు బయటకు వెళ్ళిపోతున్నట్టు సంకేతం.
ఇలా తరచూ జరుగుతూ ఉంటే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలని ఇలాంటి సమయంలో కొన్నిసార్లు కిడ్నీలకు సంబంధించిన వ్యాధులు సైతం తలెత్తే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే ఎవరికైనా తరచూ ముఖం, కాలు ఉబ్బిన జాగ్రత్త చేయకుండా వెంటనే వైద్యుల్ని సంప్రదించాలని అలాగే షుగర్ వ్యాధి ఉన్నవారు సైతం ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండటం ఎంత అవసరమని తెలుస్తోంది. అలాగే ఎక్కువ సమయం మూత్రాన్ని అదిమి పెట్టడం వల్ల మూత్రపిండాల పైన భారం పడుతుందని ఇది కూడా కొన్నిసార్లు ఈ సమస్యకు దారితీస్తుందని తెలుస్తోంది. అలాగే కిడ్నీ క్రియాటిన్ సైతం కిడ్నీలపై ప్రభావం చూపిస్తుందని ఇది కొన్నిసార్లు కిడ్నీలు ఫెయిల్ అవటానికి సైతం అవకాశం ఉందని అందుకే ఏ చిన్న విషయాన్ని ఆ జాగ్రత్త చేయకూడదని అనుమానం వచ్చిన వెంటనే వైద్యున్ని సంప్రదించి తగిన వైద్యం తీసుకోవాలని సూచిస్తున్నారు.