నడుంనొప్పా? అయితే ఇలా నయం చేసుకోండి

ఎన్ని ఎలా ఉన్నా రోజులు మారుతున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆరోగ్య పరిస్థితులు కూడా మారిపోతున్నాయి. దానికి కారణం...జీవనవిధానంలో మార్పులు రావడం. అది తెలిసి కూడా మనం చాలా బద్దకించేస్తున్నాం

నడుంనొప్పా? అయితే ఇలా నయం చేసుకోండి


ఎన్ని ఎలా ఉన్నా రోజులు మారుతున్నాయి. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆరోగ్య పరిస్థితులు కూడా మారిపోతున్నాయి. దానికి కారణం...జీవనవిధానంలో మార్పులు రావడం. అది తెలిసి కూడా మనం చాలా బద్దకించేస్తున్నాం. ఫలితం మాత్రం చాలా అనుభవించాల్సి ఉంటుంది.

నడుం నొప్పి తగ్గాలంటే ఈ ప్రాసెస్ పాటించండి..! - Manalokam

ప్రస్తుత పరిస్థితుల్లో మనిషి జీవన విధానం.....పాత రోజులకంటే భిన్నంగా ఉంటోంది.పెరిగిపోతున్న పని ఒత్తిడి, పోషకాహారం లోపం వలన.....50 ఏళ్లకో, 60 ఏళ్లకో రావాల్సిన నడుము నొప్పి ౩౦ ఏళ్లకే వచ్చేస్తుంది. ముఖ్యంగా ఆహార లోపాలు, చిన్నాభిన్నామైన దినచర్యలు, రాత్రివేళ నిద్రపోకపోవటం, పగటిపూట నిద్రించడం వంటి అలవాట్లు శరీర వ్యవస్థను బాగా దెబ్బ తీస్తున్నాయి.

వీటిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నడుమునొప్పి. నూటికి 90 శాతం మంది జీవితంలో ఒక్కసారైనా నడుము నొప్పి బారిన పడతారని అధ్యయనాల్లో తేలింది.
దానికి కారణం....ఎక్కువ సమయం ఒకే భంగిమలో కూర్చోవటం, స్థూలకాయం, విశ్రాంతి అనేది లేకుండా ఎక్కువ గంటలు విపరీతంగా పనిచేయడం, అతిగా బరువులు మోయటం, బైక్‌ మీద ఎక్కువ దూరం ప్రయాణం చేయడం, దీర్ఘకాలిక రుగ్మతలు, వంశపారంపర్యం వ్యాధులు ఇవి అన్ని నడుమునొప్పికి కారణమే.

నడుము నొప్పికి ఆయుర్వేద శాస్త్రంలో చికిత్స పద్ధతులున్నాయి. అందులో నిదాన పరివర్జనం, శమన చికిత్స, శోధన చికిత్స అనే ౩ ప్రధానమైనవి.
నిదాన పరివర్జనము అనగా వ్యాధికి కారణమైన విషయాలను పాటించకపోవడం. ఉదా: రాత్రి మేల్కోవడం, పగలు పడుకోవడం
శమన చికిత్స అంటే వ్యాధి దోషాలను శమింపచేయటానికి తెచ్చే ఔషధాలు, ఇందులో రోగ తీవ్రతను బట్టి, రోగి బలాన్ని బట్టి చూర్ణాలు, గుటికలు, కషాయాలు, లేహ్యాలు, తైలాలు రోగికి ఇస్తారు. ఈ శమనచికిత్స వలన ప్రకోపించిన దోషాలు మళ్లీ తిరగబడవచ్చు. అందుకే వ్యాధి తీత్రవను బట్టి శమన చికిత్సలతోపాటు కొందరికి పంచకర్మ శోధన చికిత్స కూడా అవసరం. తద్వారా ప్రకోపించిన దోషాలను వాత, పిత్త, కఫ సమంగా చేసి శరీర శుద్ధిని, అగ్నిబలాన్ని పెంపొందించవచ్చును.

ఆయుర్వేదాన్ని స్నేహకర్మ ద్వారా వెన్నుపూసల మధ్య, స్నిగ్ధత్వాన్ని పెంపొందించి కీళ్ల కదలికను సులభతరం చేసే అవకాశం ఏర్పడుతుంది. స్వేదకర్మ ద్వారా బిగుసుకుపోయిన కీళ్లను వదులుగా, మృదువుగా మారేలా చేయవచ్చు.

కటివస్తి: ఈ విధానం ఆయుర్వేదంలోని ఒక విశిష్ట ప్రక్రియ. అరిగిపోయిన మృదులాస్థికి రక్తప్రసరణను పెంచి నొప్పి తీవ్రతను తగ్గించడంలో ఈ ప్రక్రియ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇదే క్రమంలో సర్వాంగధార చికిత్స కూడా వీరికి బాగా ఉపయోగపడుతుంది.

వస్తికర్మ: ఆయుర్వేద శాస్త్రంలో వస్తికర్మ అనే చికిత్స అత్యంత ప్రాధాన్యత గల చికిత్స. ఈ వస్తికర్మ ముఖ్యంగా చిన్నప్రేగులు, పెద్దప్రేగులులోని ఎంటరిక్ వర్వస్ సిస్టమ్‌పై ప్రభావం చూపుతుంది. తద్వారా నాడీకణాలలో ఏర్పడిన లోపాలను సరిచేసి బలం చేకూర్చవచ్చు. అలాగే పక్వాశయలో వాతస్థానం కాబట్టి ప్రకోపించిన వాతాన్ని కూడా సహజస్థితికి తీసుకురావచ్చు.

అవసరమైన పోషకాహారం తీసుకుంటూ వైద్యులు సూచించిన విధానాలను అనుసరించడం చాలా అవసరం. ఔషధ చికిత్సల తరువాత క్రమం తప్పకుండా వ్యాయామం కూడా చేస్తే నడుము నొప్పి సమస్య నుంచి శాశ్వతంగా విముక్తి కలుగుతుంది.

వెన్నుపూసల మధ్య ఉండే డిస్కుల్లో కొన్ని మార్పులు జరిగినప్పుడు, డిస్క్‌ల మీద ఒత్తిడి పెరుగుతుంది. దాంతో వాపు రావటం, డిస్క్‌కి రక్త ప్రసరణ సరిగా లేకపోవటం, డిస్కు అరిగిపోవడం వంటి అనేక సమస్యల వల్ల ఈ నొప్పి వస్తుంది. డిస్కులో వాపు వస్తే అందులోంచి చిక్కని ద్రవం బయటికి వచ్చి మేరుదండం నుంచి వచ్చే నరాలపైన ఒత్తిడి పెరుగుతుంది. దీనివల్ల వెన్ను నొప్పి వస్తుంది.

నడుములో నొప్పి, వాపు, ఏ కాస్త శ్రమించినా నొప్పి తీవ్రం కావటం, సూదులతో గుచ్చినట్లుగా నొప్పి, కాళ్లల్లో తిమ్మిర్లు, మంటలు ఉంటాయి. సకాలంలో చికిత్స అందకపోతే స్పర్శజ్ఞానం కోల్పోతారు. సమస్య తీవ్రమైతే కొందరు మలమూత్రాల మీద నియంత్రణ కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. పెయిన్ కిల్లర్స్ వాడటం మంచిది కాదు. పెయిన్ కిల్లర్స్‌ వల్ల మలబద్ధకం, జీర్ణాశయ సమస్యలు వస్తాయి. వెన్ను సంబంధిత సమస్యలను వెంటనే గుర్తించి చికిత్స తీసుకుంటే ఈ వ్యాధి రాకుండా పోతుంది.

గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.