40 ఏళ్లు దాటిన స్త్రీ, పురుషులు ఈ ఆహారాలను కచ్చితంగా తినాలి తెలుసా..?

మన వయసుకు తగ్గట్టుగా మనం తినే ఆహారంలో మార్పులు చేసుకోవాలి.. చిన్నప్పుడు తిన్నవి పెద్దయ్యాక తినలేం.. అలాగే ఏజ్‌లో ఉన్నప్పుడు తిన్నవే.. 40 దాటక తింటామంటే కుదరదు.. మీ వయసు పెరిగేకొద్ది శరీరానికి కావాల్సిన పోషకాలు

40 ఏళ్లు దాటిన స్త్రీ, పురుషులు ఈ ఆహారాలను కచ్చితంగా తినాలి తెలుసా..?


మన వయసుకు తగ్గట్టుగా మనం తినే ఆహారంలో మార్పులు చేసుకోవాలి.. చిన్నప్పుడు తిన్నవి పెద్దయ్యాక తినలేం.. అలాగే ఏజ్‌లో ఉన్నప్పుడు తిన్నవే.. 40 దాటక తింటామంటే కుదరదు.. మీ వయసు పెరిగేకొద్ది శరీరానికి కావాల్సిన పోషకాలు పెరుగుతాయి. ముఖ్యంగా మధ్య వయసు వారితో పోలిస్తే 40 సంవత్సరాలు పైబడిన వారికి ఎక్కువ పోషకాలు అవసరమవుతాయి. ప్రొటీన్లు, విటమిన్లు, కాల్షియం వంటి పోషకాలు వారిలో శారీరక, అభిజ్ఞ పనితీరుకు ఎంతగానో సహకరిస్తాయి. 40 సంవత్సరాలు దాటిన తర్వాత స్త్రీ, పురుషులు వారు తీసుకునే ఆహార విషయంలో ఎంతో జాగ్రత్త వహించాలి. వృద్ధాప్యం కారణంగా వారిలో వచ్చే వైకల్యం, ఇతర వ్యాధులను నివారించడానికి అధిక పోషకాలు కలిగిన ఆహారాలు తీసుకోవాలి.. మరి ఏం ఆహారాలు తీసుకోవాలో చూద్దామా..!

40 దాటిన పురుషులు తీసుకోవాల్సిన ఆహారాలు..

టమోటాలలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉండే లైకోపీన్ అనే కెరోటినాయిడ్స్ ఉంటాయి. ఇవి టమోటాలకు ఎరుపురంగును ఇవ్వడమే కాకుండా వృద్ధాప్యంలో వచ్చే ప్రోస్టేట్ క్యాన్సర్‌ను ఎదుర్కోవడానికి దోహదపడుతాయి.
వృద్ధాప్యంలో దృష్టిలోపం, అధిక రక్తపోటు, క్యాన్సర్ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ విధమైన వ్యాధులను నివారించడం కోసం చిలగడదుంపలు ఉత్తమమైన ఆహారం అని చెప్పవచ్చు. చిలగడ దుంపలలో అధిక భాగం పొటాషియం, బీటా కెరోటిన్, ఫైటోకెమికల్స్ అధికంగా లభిస్తాయి. ఇవి వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులను రాకుండా చూస్తాయి.
గుడ్లలో ప్రొటీన్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీర పెరుగుదలకు, ఎముకలకు బలాన్ని పెంచడానికి, దీర్ఘకాలిక మంట, క్షీణత వ్యాధులను నివారించడానికి దోహదపడతాయి.
40 సంవత్సరాలు పైబడిన వారు వారంలో రెండుసార్లు పుట్టగొడుగులు తీసుకోవడం మంచిది.. దీని వల్ల వారి మెదడు పనితీరు పెరగడంతోపాటు జ్ఞాపక శక్తి కూడా మెరుగుపడుతుంది.
రోజ్ ఆపిల్‌లో అధిక మొత్తంలో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇందులో టర్పానాయెడ్లు ఉండటం వల్ల మెదడు, కంటి ఆరోగ్యం మెరుగుపడుతుంది.
నలభై ఏళ్లకు పైబడిన వారు నిత్యం బాదం పప్పును తీసుకోవాలి. దీని వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మెదడు పనితీరు మెరుగు పడుతుంది. వాపులు తగ్గుతాయి. క్యాన్సర్లు రాకుండా ఉంటాయి.

స్త్రీలు తీసుకోవలసిన ఆహార పదార్థాలు

40 ఏళ్లకు పైబడిన స్త్రీలలో సహజంగానే కాల్షియం లోపిస్తుంది.. దీంతో ఎముకలు బలహీనంగా మారుతాయి. ఎముకల్లో సాంద్రత తగ్గుతుంది. ఎముకలు గుల్లగా మారి విరిగేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది.. అందువల్ల మహిళలు రోజూ పాలు తాగాల్సి ఉంటుంది. దీంతో కాల్షియం లోపం వల్ల వచ్చే సమస్యలను నివారించవచ్చు.
బ్లూ బెర్రీస్‌లో అధిక భాగం విటమిన్ సి, విటమిన్ కె, మాంగనీస్ ఉండటం వల్ల ఇవి మెదడు పనితీరును మెరుగుపరుస్తాయి.
పెరుగులో అధికభాగం క్యాల్షియం, విటమిన్ బి12, రైబోఫ్లెవిన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి మహిళలలో ఎముకల సంబంధిత వ్యాధులు, రుతుక్రమం ఆగిన లక్షణాలను నివారించడానికి దోహదపడుతాయి.
బచ్చలి కూరలో అధికభాగం విటమిన్ సి, యాంటి ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో ఏర్పడే ఫ్రీరాడికల్స్‌ను తొలగించి వృద్ధాప్యాన్ని తగ్గించడానికి సహాయపడుతాయి.
అవిసె గింజలలో అధికభాగం ఫైటో ఈస్ట్రోజెన్‌లు, లెనోలేనిక్ ఆమ్లాలు, విటమిన్లు అధిక మొత్తంలో ఉంటాయి. ఇవి మహిళల్లో హార్మోన్ల అసమతుల్యతను, పునరుత్పత్తి ప్రక్రియను మెరుగుపరుస్తాయి.
గమనిక : ఇందులోని అంశాలు, సూచనలు, సలహాలు, సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు.. సందేహాలు సంబంధిత నిపుణుల‌ను సంప్ర‌దించండి.